సారాంశం

ఈ ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్. లక్నో కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ తన తొలి మ్యాచ్ లో తొలి బంతికే ఔటై, వెనుదిరిగాడు. దాంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అతడితో ఆటాడుకుంటున్నారు.

పంత్ గోల్డెన్ డక్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ అదిరిపోయేలా స్టార్ట్ అయింది. మొదట్లో 3 మ్యాచ్‌లు చాలా ఉత్కంఠగా, ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండాయి. నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ విశాఖపట్నంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ బ్యాట్‌తో స్టేడియంలో దుమ్ము రేపారు. వాళ్ల బ్యాట్ల నుంచి వచ్చిన సిక్సులు, ఫోర్లతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్‌కి పండగ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ, లక్నో కెప్టెన్ పంత్ మాత్రం ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు, ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. పంత్ గోల్డెన్ డక్ అవ్వగానే సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారుతోంది. అసలు విషయం ఏంటంటే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు, కెప్టెన్ అయిన పంత్ నుంచి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రాగానే బ్యాట్‌తో అదరగొడతాడని అనుకున్నారు. కానీ, కుల్దీప్ యాదవ్ బంతికి బోల్తా కొట్టి 0 స్కోర్‌కే వికెట్ పారేసుకున్నాడు. అతను రాకముందు పూరన్, మార్ష్ విధ్వంసం సృష్టించారు. పంత్ అవుట్ అవ్వగానే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది, సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ఎక్స్(X)లో మీమ్స్ క్రియేట్ చేసి పంత్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. వాటిపై ఓ లుక్ వేద్దాం.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్లకు అమ్ముడుపోయిన పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ భారీగా బిడ్ వేసి పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ టీమ్ నుంచి వెళ్లిపోవడంతో పంత్‌ను కెప్టెన్‌గా కూడా చేశారు. పంత్ పేరు మార్మోగిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు అతని కెప్టెన్సీ, బ్యాటింగ్ గురించి మీడియాలో తెగ చర్చలు జరిగాయి. కానీ, కుల్దీప్ బంతికి గోల్డెన్ డక్ అవ్వడంతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మార్ష్, పూరన్ బ్యాట్లతో ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టారు టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పంత్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి 30 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. అతనితో పాటు మిచెల్ మార్ష్ కూడా 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీయగా, మోహిత్ శర్మ 2, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.