ప్రో కబడ్డి 2019: హర్యానా దెబ్బకు చిత్తయిన పుణేరీ పల్టాన్స్...
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని అందుకుంది. పుణేరీ పల్టాన్స్ ను మట్టికరిపించి భారీ పాయింట్ల తేడాతో గెలిచింది.
బెంగళూరు వేదికన జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7 లో హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పుణేరీ పల్టాన్స్ ఏ దశలోనూ హర్యానాకు పోటీనివ్వలేకపోయింది. దీంతో వరుసగా పాయింట్లు సాధిస్తూ దూసుకుపోయిన స్టీలర్స్ జట్టు 14 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇలా పుణేరీ జట్టు ఈ సీజన్లో మరో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
హర్యానా స్టార్ రైడర్ వికాస్ 11 పాయింట్లు సాధించి ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ధర్మరాజ్ 5, వినయ్ 5, ప్రశాంత్ 4, రవి కుమార్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ఇక సునీల్ 3, వికాస్ 2, వికాస్ చిల్లన్ 1 పాయింట్ తో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్ట్రాల రూపంలో 2 మొత్తంగా 41 పాయింట్లతో హర్యానా అద్భుత విజయాన్ని అందుకుంది.
ఇక పుణేరీ జట్టు రైడింగ్ లో 18, ట్యాకిల్స్ లో 8, ఎక్స్ట్రాల రూపంలో 1 పాయింట్ తో అన్ని విషయాల్లోనూ విఫలమయ్యింది. ఆటగాళ్లలో నితిన్ తోమర్ 8, పంకజ్ 7, సుజీత్ 5 పాయింట్లతో జట్టును గెలింపించడానికి ప్రయత్నించారు. కానీ మిగతా ఆటగాళ్లు ఆశించిన మేర రాణించకపోవడంతో పుణేరీ టీం కు ఓటమి తప్పలేదు. మొత్తానికి 27-45 పాయింట్ల తేడాతో పూణే జట్టుపై హర్యానా ఘన విజయం సాధించింది.