Asianet News TeluguAsianet News Telugu

Paris 2024: పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన 17వ భారత షూటర్ గా విజయ్‌వీర్ సిద్ధూ

Vijayveer Sidhu: పారిస్ ఒలింపిక్స్ కు భారత్ షూటింగ్ విభాగంలో భారీ బృందాన్ని పంపుతోంది. తాజాగా విజయ్‌వీర్ సిద్ధూ తో క‌లిపి ఇప్పటివరకు 17 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. ఒలింపిక్స్ కు భారత్ ఇంత పెద్ద సంఖ్యలో బృందాన్ని పంపడం గతంలో ఎన్నడూ లేదు.

Paris 2024 Summer Olympics: Vijayveer Sidhu becomes 17th Indian shooter to qualify for Paris Olympics RMA
Author
First Published Jan 16, 2024, 8:42 PM IST

Paris 2024 Summer Olympics: ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ లో రైఫిల్/పిస్టల్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో భార‌త షూట‌ర్ సిద్ధూ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. విజయ్ వీర్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో రజత పతకం సాధించి ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. దీంతో భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన 17వ షూటర్ గా సింధు రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో నలుగురు భారత షూటర్లు ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. భారత షూటర్లు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఎక్కువ ప‌తకాలు సాధించాలని భారత క్రీడా వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రపంచంలోనే తొలి క్రికెట‌ర్ గా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

జకార్తాలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ లో విజయ్ వీర్ రజత పతకం సాధించాడు. భారత షూటర్ ఫైనల్ రౌండ్లో 28 పాయింట్లతో ఒలింపిక్ అర్హతను బెర్త్ ను ఖాయం చేసుకున్నాడు. కజకిస్థాన్ కు చెందిన నికితా చిర్యుకిన్ 32 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన జోంగ్-హో సాంగ్ కాంస్య పతకం సాధించాడు. చివరి రౌండ్ కు ముందే విజయ్ వీర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో 289 పాయింట్లు సాధించాడు. మొత్తం 577 పాయింట్లు సాధించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సుమిత్ నాగల్ సంచలనం..35 ఏండ్ల త‌ర్వాత స‌రికొత్త రికార్డు

ఒలింపిక్స్ కు అర్హత సాధించిన అనంతరం విజయ్ వీర్ మాట్లాడుతూ.. ''అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. జాతీయ శిబిరంలో కష్టపడి పనిచేశాం. ఈ పోటీలో పాల్గొనడానికి జకార్తాకు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. జకార్తా షూటింగ్ రేంజ్ ఢిల్లీ రేంజ్ ను పోలి ఉంటుంది. ఒలింపిక్ క్వాలిఫయర్స్ లో నేను సాధించిన స్కోరుతో నేను చాలా సంతోషంగా లేను. ఎక్కడ మెరుగవ్వాలో మాకు తెలుసు. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత పని ప్రారంభిస్తాం. కానీ ఫైనల్లో నేను చూపించిన ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అంకితమిస్తున్నాను. నా కోచ్ లు ఎల్లప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను'' అని తెలిపాడు. 

రోహిత్ శ‌ర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ మార్చ‌డానికి ఇదే కార‌ణం..

Follow Us:
Download App:
  • android
  • ios