రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ మార్చడానికి ఇదే కారణం.. యువరాజ్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్ లో గుజరాత్ కు సారథిగా ఉన్న హార్దిక్ పాడ్యాను తీసుకువచ్చి అప్పటివరకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో పెట్టింది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ. ఎందుకు ఇలా చేసిందనే అంశంపై చర్చసాగుతున్న క్రమంలో తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
![Yuvraj Singh's shocking comments on mumbai indians captaincy shifted from Rohit Sharma to Hardik Pandya RMA Yuvraj Singh's shocking comments on mumbai indians captaincy shifted from Rohit Sharma to Hardik Pandya RMA](https://static-ai.asianetnews.com/images/01hm93s1rsn6a0k1xgjagywgvs/ggggggggg-jpg_363x203xt.jpg)
Yuvraj Singh's comments on Rohit-Pandya: టీమిండియా స్టార్ ప్లేయర్, ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన సారథి హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంఛైజీ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ స్థానంలో ఐపీఎల్ 2024 సీజన్ కోసం హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది ముంబై టీం. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికీ ఈ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. ముంబై ఇండియన్స్ కు విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎందుకు ముందుకు సాగుతోందని చర్చ మధ్య భారత్ స్టార్ ఆల్ రౌండర్, ఐసీస వరల్డ్ కప్ విన్నింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ భారీ మొత్తం చెల్లించి గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది. అప్పటికే కెప్టెన్ మార్పు గురించి చర్చ మొదలైంది. అనుకున్నట్టుగానే రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాడ్యా కెప్టెన్ గా కొనసాగుతారని వెల్లడించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, రోహిత్ శర్మను తప్పించడంపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ క్రికెట్ లో ప్రతి ప్లేయర్ ఏదో ఒక సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదర్కొంటాడని తెలిపారు. ఫ్రాంచైజీ క్రికెట్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అంగీకరించిన యువరాజ్.. యువ ప్రతిభావంతుల కోసం నిరంతరం అన్వేషణకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. అలాగే, ఫ్రాంచైజీ క్రికెట్ లో వయసు పెరిగే కొద్దీ కష్టాలు తప్పవని తెలిపాడు.
IND vs AFG: భారత్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ లైవ్ చూడాలి? పూర్తి వివరాలు ఇవిగో
ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఆడేందుకు వయసు అడ్డు వస్తే కెరీర్ కష్టమవుతుందని యువరాజ్ సింగ్ అన్నాడు. ప్రతి ఫ్రాంచైజీ యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని చూస్తుందనీ, వారికోసమే ఎక్కువగా ఖర్చు చేయడానికి కూడా వెనుకడుగు వేయదని చెప్పాడు. భవిష్యత్తుకు అనుగుణంగా కదలాలనుకుంటున్నారనీ, తాను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాని చెప్పాడు. అయితే, రోహిత్ శర్మ అపార అనుభవం, గత విజయాలను ప్రస్తావించిన యువరాజ్ సింగ్.. ఫ్రాంచైజీలు దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి యువ ప్రతిభావంతుల ఆవిర్భావం టీ20 రంగానికి కొత్త డైనమిక్ ను జోడించిందనీ, స్థిరమైన ఆటగాళ్లకు పోటీ వాతావరణాన్ని సృష్టించిందని తెలిపాడు.
అయితే, టీ20 క్రికెట్ లో కూడా అనుభవానికి ఉన్న విలువను ఫ్రాంఛైజీలు పరిగణలోకి తీసుకుంటాయనే ఆశాభావం వ్యక్తం చేశాడు యువరాజ్ సింగ్. పోటీ పెరుగుతున్నప్పటికీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల నైపుణ్యాలు, పరిజ్ఞానం ఏ జట్టుకైనా అమూల్యమైన ఆస్తులు అని నొక్కి చెప్పారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం రాబోయే సీజన్ కోసం జట్టులో కొత్త శక్తిని, డైనమిక్స్ ను నింపే ఎంఐ వ్యూహంలో భాగంగా చూడవచ్చనీ, ఇది వారి ఐపీఎల్ ఆధిపత్యాన్ని తిరిగి పొందే లక్ష్యంతో ముడిపడిన అంశంగా యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు