చతేశ్వర్ పూజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు...
పూజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక మ్యాచ్ నుంచి పూజారాను సస్పెండ్ చేశారు. పుజారా సారథ్యం వహిస్తున్న జట్టుకు జట్టుకు 12 పాయింట్ల పెనాల్టీ పడింది.

నయా వాల్ చతేశ్వర్ పూజారాపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. భారత టెస్ట్ ఆటగాడైన పూజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో ససెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ జట్టుకు 12 పాయింట్ల పెనాల్టీ పడింది. దీంతో ఈ ఎఫెక్ట్ తో జట్టు కెప్టెన్ అయిన పూజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కౌంటి ఛాంపియన్షిప్ అధికారులు పూజారా మీద ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు.
ఓ జట్టు ఒక సీజన్లో 4 ఫిక్స్ డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే.. ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఆటగాడిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. అది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధన. ఈ నిబంధనల మేరకే ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో పూజారా నాయకత్వం వహిస్తున్న ససెక్స్ జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది.
ససెక్స్ టోర్నీ తొలి లెగ్ లో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంది. లీసెస్టర్ షైర్ తో సెప్టెంబర్ 13వ తేదీన జరిగిన మ్యాచ్లో మరో రెండు పెనాల్టీలను ఎదుర్కొంది. దీంతో మొత్తంగా 12 డీమెరిట్ పాయింట్లు జట్టు ఖాతాలోపడ్డాయి. దీంతోనే ససెక్స్ అధికారులు పూజారాపై సస్పెన్షన్ వేటును ఎలాంటి వాదనలు చేయకుండానే స్వీకరించారు.
ఆన్ ఫీల్డ్ లో ఆటగాళ్ల ప్రవర్తన కారణంగా ససెక్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ససెక్స్ ఆటగాళ్లయిన జాక్ కార్సన్, టామ్ హెయిన్స్, కార్వెలాస్ లు లీసెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్లో నిబంధనలకు విరుద్ధంగా మైదానంలో ప్రవర్తించారు. దీనికి జట్టు కెప్టెన్ అయిన పూజారా బాధ్యుడయ్యాడు.
దీంతో ససెక్స్ అధికారులు తరువాతి మ్యాచ్ కు ఈ ముగ్గురు ఆటగాళ్లలో జాక్ కార్సన్ , టామ్ హెయిన్స్ ల మీద వేటు వేశారు. కార్వేలాస్ పై కూడా విచారణ తర్వాత చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుత కౌంటి ఛాంపియన్షిప్ లో ససెక్స్ జట్టు పాయింట్ల కోత కారణంగా మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.
ససెక్స్ ఖాతాలో ప్రస్తుతం 124పాయింట్లు ఉన్నాయి. ససెక్స్ జట్లు సెప్టెంబర్ 19-22 వరకు కౌంటింగ్ డివిజన్2 పోటీల్లో భాగంగా ఢెర్బీషైర్ తో పోటీ పడాల్సి ఉంది. సెప్టెంబర్ 24న గ్లోసెస్టర్ షైర్ ను తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్ ఈ రెండు మ్యాచ్లతో ముగుస్తుంది. ససెక్స్ పాయింట్లలో కోతపడడంతో డర్హం.. పాయింట్ల పట్టికలో లీడింగ్ లో ఉంది. 198 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.