Asianet News TeluguAsianet News Telugu

భారత్ vs ఆసిస్ : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు రెండు జట్లు.. మొదటి రెండు మ్యాచ్ ల కెప్టెన్ కేఎల్ రాహుల్...

ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ రెండు జట్లను ప్రకటించారు సెలెక్టర్లు. మొదటి రెండు మ్యాచ్ లకు కేఎల్ రాహుత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. 

India vs Asia ODI : Two teams announced for three match ODI series - bsb
Author
First Published Sep 19, 2023, 9:38 AM IST

ఢిల్లీ : సెప్టెంబర్ 22, 24, 27 తేదీలలో ఇండియాలో భారత్ ఆస్ట్రేలియాల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సెప్టెంబర్ 18వ తేదీన రెండు వేర్వేరు జట్టను ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈసారి రెస్ట్ ఇచ్చారు. ఆయనతోపాటు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు కూడా విశ్రాంతి దొరికింది.  

సెలెక్టర్లు వీరందరికీ ఈ వన్డే సిరీస్ మ్యాచ్ లో  మొదటి రెండు మ్యాచ్ లకు రెస్ట్ ఇచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ రెస్ట్ లో ఉండడంతో టీమిండియా కు ప్రస్తుతం కెఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. తొలి రెండు మ్యాచ్లకు కే ఎల్ రాహుల్ కు డిప్యూటీగా రవీంద్ర జడేజా ఉంటారు.  మూడో వన్డేలో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తారు.  రోహిత్ శర్మతోపాటు హార్థిక్ పాండ్యాలు, కుల్దీప్ యాదవ్, విరాట్ కోహ్లీలు కూడా మూడో వన్డేలో జట్టులోకి వచ్చి చేరతారు. 

యజ్వేంద్ర చాహాల్ కథ ముగిసినట్టేనా! ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ చోటు మిస్...

తొలి రెండు వన్డేలకు ఊహించని విధంగా రుతురాజు గైక్వాడ్ ఎంపిక కాగా.. ఎప్పటినుంచో ఊహిస్తున్న విధంగానే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో టీమిండియాకు గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. అక్షర్ పటేల్ ఆసియా కప్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కారణాంగానే తొలి రెండు మ్యాచ్లకు అక్షర పటేల్ దూరం ఉండనున్నాడు.  

ఇక మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ రెండు జట్లలోను చోటు దక్కించుకున్నాడు. తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ కూడా తొలి రెండు వన్డే మ్యాచ్లకు ప్రకటించిన జట్టులో చోటు సంపాదించాడు. ఈ సిరీస్లో  జరిగే మూడు మ్యాచ్లలో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే మ్యాచ్ ఇండోర్లో.. మూడో వన్డే మ్యాచ్ రాజకోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లు అన్నీ కూడా నియమిత తేదీల్లో మధ్యాహ్నం 1:30 నుంచి ప్రారంభమవుతాయి. 

ఇక ఈ సిరీస్ ముగియగానే వరల్డ్ కప్ సన్నాహక మ్యాచులు ప్రారంభమవుతాయి. 7, 8 రోజుల తేడాతో అక్టోబర్ ఐదు నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. 2023 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్- గత ఎడిషన్ రన్నర్ ఆఫ్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.  క్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో మెగాటోర్నీలో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతోంది.  

ఆఫ్గానిస్థాన్తో అక్టోబర్ 11న, పాకిస్తాన్ లో అక్టోబర్ 14న తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ కు వేదిక కానుంది. ఈసారి మూడు మ్యాచ్ల సిరీస్ కి రెండు జట్లను ప్రకటించిన సెలెక్టర్లు.. వారి జాబితా విడుదల చేశారు. 

ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా, ఆ తరువాత వరుసగా ప్లేయర్లు రుతురాజు గైక్వాడ్, శుభ్ మన్ గిల్,  శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ,  ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్),శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్,  రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ,  జస్ప్రీత్  బుమ్రా, మహమ్మద్ సిరాజ్,  ప్రసిద్ధి కృష్ణలు ఎంపికయ్యారు.

మూడో వన్డే కు ఎంపికైన భారత జట్టు ఇలా ఉంది…
కెప్టెన్ రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, షార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్,  మహమ్మద్ సిరాజ్,  మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు.. 

ఇదే టీమ్ ఇండియాతో వన్డే సిరీస్ కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి… 
కెప్టెన్ గా పాట్ కమిన్స్, అలెక్స్ క్యారీ, సీన్ అబాట్,నాథన్ ఎల్లిస్,  కెమెరూన్ గ్రీన్,  జోష్  హాజిల్ వుడ్, జోష్ ఇంగ్లీస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్,  గ్లెన్ మాక్స్ వెల్,  తన్వీర్ సంఘ,  మిచెన్ స్టార్క్, మార్ట్ షార్ట్, స్టోయినిస్,  స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాలు ఉన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios