నార్త్ లండన్ 426 పరుగులు చేయగా, రిచ్‌మండ్ కేవలం 2 పరుగుల్లో ఆలౌట్ అవడం క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుగా నమోదైంది.

క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు చూశాం.పరుగుల వరదలు చూశాం. కానీ ఇలాంటి మ్యాచ్‌ మాత్రం ఇప్పటి వరకు కనీవినీ ఎరుగం.కనీసం గల్లీ క్రికెట్‌ ఆడే పోరగాళ్లు కూడా ఈ రికార్డు క్రియేట్‌ చేయాలంటే చాలా కష్టమైన పనే అని చెప్పుకోవచ్చు.అప్పుడేప్పుడో 1810లో ఇలాంటి రికార్డు నమోదు అయ్యింది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు..ఓ టీమ్‌ కష్టపడి 426 పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచితే..ఆ జట్టు ఏకంగా......2 పరుగులు చేసింది.

అందులో కూడా ఓ పరుగు వైడ్‌ ద్వారా వస్తే..ఓ పరుగు 11 మంది ప్లేయర్లు అతి కష్టం మీద సాధించారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మిడిలెసెక్స్ కౌంటీ లీగ్‌లో నార్త్ లండన్ సీసీ,రిచ్‌మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రిచ్‌మండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో, నార్త్ లండన్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వారు ఆట మొదలెట్టిన కొద్దిసేపటికే ప్రత్యర్థి జట్టు ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతుంది.

నార్త్ లండన్ జట్టు 45 ఓవర్లలో 426 పరుగులు చేయడం గమనార్హం. 6 వికెట్ల నష్టానికి ఈ భారీ స్కోరు చేయడంతో రిచ్‌మండ్ జట్టు ముందు 427 పరుగుల లక్ష్యం ఏర్పడింది. ఎప్పుడైతే ఇలాంటి భారీ లక్ష్యాలు ఉంటాయో, అప్పుడే మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని భావించవచ్చు. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది.

రిచ్‌మండ్ జట్టు బ్యాటింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే వారి స్థితి దిగజారిపోయింది. నార్త్ లండన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి వికెట్లను వరుసగా పడగొట్టారు. అవస్థలు పడ్డ రిచ్‌మండ్ బ్యాటర్లు కేవలం 5.4 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే వారు చేసిన మొత్తం స్కోరు కేవలం రెండు పరుగులే.

అందులోనూ ఒక్క పరుగు మాత్రమే బ్యాట్స్‌మెన్ నుంచి వచ్చింది. మిగిలిన ఒక్క పరుగు కూడా పరుగు వైడ్‌ బంతితో వచ్చింది. అంటే మొత్తం 11 మంది ఆటగాళ్లు కలిసి సాధించగలిగిన స్కోరు – ఒక్క పరుగు. ఇది క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.

ఈ విజయంతో నార్త్ లండన్ సీసీ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 6 పరుగులు కాగా, ఇది 1810లో నమోదైంది. కానీ ఇప్పటి ఈ మ్యాచ్‌లో రిచ్‌మండ్ కేవలం 2 పరుగులకే కుప్పకూలడంతో ఆ పురాతన రికార్డును దాటి కొత్త చరిత్ర నమోదు చేసింది.