ఇంగ్లాండు, ఇండియా రెండో వన్డేలో మ్యారేజ్ ప్రపోజల్
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ల మధ్య జరిగిన రెండో వన్డేలో విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన గర్ల్ఫ్రెండ్కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు.
లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ల మధ్య జరిగిన రెండో వన్డేలో విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని తన గర్ల్ఫ్రెండ్కు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీంతో సిగ్గుతో మొగ్గయిన ఆ యువతి తర్వాత అతని ప్రపోజల్కు పచ్చజెండా ఊపింది. అతను ఇచ్చిన రింగ్ను స్వీకరించింది. దీంతో స్టేడియంలో సందడి చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు టీవీలో కూడా ప్రసారం అయ్యాయి.
కామెంటేటర్స్ కూడా దీనిపై స్పందించారు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్ చాహల్ కూడా క్లాప్స్ కొడుతు వారికి శుభాకాంక్షలు తెలిపాడు.
అయితే ఆ వ్యక్తి ప్రపోజ్ చేసిన సమయంలో "డెసిషన్ పెండింగ్ " అంటూ.. ఆమె అతని ప్రపోజల్ అంగీకరించిన తర్వాత "షీ సెడ్ యస్ " అంటూ టీవీ తెరపై ప్లాష్ ఇచ్చారు. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి.
ఆ తర్వాత వారిద్దరిని కామెంటేటర్స్ బాక్స్లోకి పిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అధికారులు వారికి చిన్నపాటి బహుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ROMANCE is in the Air !! A Marriage proposal at Lords during 2nd ODI match between India & England & the girl said Yes ! ❤ 💍#INDvsENG #ENGvIND #INDvENG pic.twitter.com/e3xCqfTMk1
— Rosy (@rose_k01) July 14, 2018