రాజస్థాన్ కథ ముగిసింది. (వీడియో)
క్వాలిఫయర్-2కు కోల్కతా (వీడియో)
రాజస్థాన్ కథ ముగిసింది . 20 ఓవర్లు.. 170 పరుగుల లక్ష్యం.. ఓ దశలో రాజస్థాన్ జట్టు స్కోరు 109/1. గెలువాలంటే 35 బంతుల్లో 69 పరుగులు చేయాలి.కానీ ఏం లాభం. కోల్కతా బౌలర్ల నైపుణ్యం ముందు రాజస్థాన్ బడా హిట్టర్లందరూ దూది పింజల్లా తేలిపోయారు.
లీగ్ దశ నుంచి నిలకడైన విజయాలు సాధిస్తున్న కోల్కతా నాకౌట్లోనూ ఆకట్టుకుంది. ఆల్రౌండ్ షోతో అదురగొడుతూ కీలక మ్యాచ్లో సత్తా చూపెట్టింది. రస్సెల్ (25 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు)
కుల్దీప్, చావ్లా రాణించడంతో రాజస్థాన్ను ఓడించి సన్రైజర్స్తో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఫైనల్లో ఆదివారం చెన్నైని ఢీకొంటుంది.