కార్తీక్ కి కోపం.. జోకులు పేలుస్తున్న నెటిజన్లు
ధోనీ తర్వాత మిస్టర్ కూల్ అన్న పేరు దినేష్ కార్తీక్ కి బాగా సూటౌతుంది. అలాంటి కార్తీక్ కి నిన్నటి మ్యాచ్ లో పట్టరానంత కోపం వచ్చేసింది.
ధోనీ తర్వాత మిస్టర్ కూల్ అన్న పేరు దినేష్ కార్తీక్ కి బాగా సూటౌతుంది. అలాంటి కార్తీక్ కి నిన్నటి మ్యాచ్ లో పట్టరానంత కోపం వచ్చేసింది. ప్లేఆఫ్ బెర్త్ కోసం పంజాబ్తో మ్యాచ్లో గెలుపు అత్యంత కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్లో కోల్కతా సారథిగా దినేశ్ కార్తీక్ కొంచెం టఫ్గా వ్యవహరించాడు.
మ్యాచ్ గెలువాలన్న టెన్షన్... జట్టు సభ్యలుపై కార్తీక్ అరిచేశాడు. కోచ్ చూస్తుండగానే మైదానంలో తన జట్టు సభ్యులందరినీ పిలిచి.. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ తన టీమ్మేట్స్కు ఏం చెప్పాడన్నది వినిపించకపోయినప్పటికీ.. గట్టిగా ఆదేశాలు ఇవ్వడం.. కొంచెం టఫ్గా మాట్లాడటం కనిపించింది. కార్తీక్ ఘాటుగా మాట్లాడుతుండటం జట్టు సభ్యులు కూడా ఒకింత గంభీరంగా కనిపించారు.
మ్యాచ్ చివరికీ కోల్ కతానే కైవసం చేసుకుందనుకోండి ఇది వేరే విషయం. అయితే.. ఇప్పుడు కార్తీక్ కోపంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. రకరకాల మీమ్స్ తయారు చేసి.. నెట్టింట ఫన్ క్రీయేట్ చేశారు. ఆ మీమ్స్ కడుపుబ్బా నవ్వించేలా ఉండటం విశేషం. ఇక కోల్కతా జట్టు లీగ్ దశలో చివరి మ్యాచ్ని ముంబయి ఇండియన్స్తో ఆదివారం రాత్రి 8 గంటలకి వాంఖడేలో ఆడనుంది