అవకాశం దొరికిన ప్రతిసారీ పాకిస్థాన్, పాకిస్థాన్  ఆటగాళ్లు భారత్ పై తమ అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. మన జట్టు ఓడిపోవడానికి చేయగలిగినదంతా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమి కోరుకుంటూ న్యూజిలాండ్ బౌలర్లకు సలహాలు ఇస్తున్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్‌కు న్యూజిలాండ్ ప్రత్యర్థి అయినప్పటికీ, చాలా అదృశ్య శత్రువులు కూడా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాలని బంగ్లాదేశ్, పాకిస్థాన్ కోరుకుంటున్నాయి.  మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ న్యూజిలాండ్‌కు డైరెక్ట్‌గా మద్దతు తెలిపాడు. భారత్‌ను ఓడించడానికి న్యూజిలాండ్ జట్టుకు ప్రత్యేక సలహాలు ఇచ్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. 'మీరు భారత్‌ను ఓడించాలనుకుంటే, ముందున్నది భారత్ అని మర్చిపోవాలి. మీ జట్టులో శక్తి తక్కువని మర్చిపోవాలి. మీ జట్టు భారత్ అంత శక్తిమంతమైనది కాదని మర్చిపోవాలి. శాంట్నర్‌కు ఆ నమ్మకం ఉంది. కెప్టెన్‌గా అతను టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాడు' అని అన్నాడు.

భారత్‌ను ఓడించాలంటే ఏం చేయాలి?

న్యూజిలాండ్ జట్టును ఉద్దేశించి షోయబ్ మాట్లాడుతూ, 'ఏ జట్టు అయినా గెలవచ్చు. సరైన సమయంలో సరైన పని చేయాలి. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురావాలి. రోహిత్ శర్మ దాడి చేస్తాడు. అతను మీ స్పిన్నర్లను పనికిరాకుండా చేయాలని చూస్తాడు. అతను శాంట్నర్‌పై దాడి చేస్తాడు. ఆ సమయంలో శాంట్నర్ ఒక లీడర్‌గా జట్టును నడిపించాలి. నన్ను ఎవరైనా అడిగితే, మ్యాచ్‌లో భారత్‌కు 70-30 ఛాన్స్ ఉంది అని చెబుతా. వాళ్లు బ్యాటింగ్, స్పిన్నర్లు, మెచ్యూర్డ్ మెంటాలిటీతో ముందున్నారు. కానీ న్యూజిలాండ్ బెస్ట్ గేమ్ ఆడితే, వాళ్లే గెలుస్తారు' అని అన్నాడు.

షోయబ్ మాలిక్ కూడా న్యూజిలాండ్ వైపే

షోయబ్ అక్తర్ లాగే పాకిస్థాన్ నేషనల్ టీమ్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా న్యూజిలాండ్ గెలుస్తుందని ఆశిస్తున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లకు అతని సలహా ఏమిటంటే, 'భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎలా రన్స్ చేయాలో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ఒక ఉదాహరణగా నిలిచింది. అతను 30 గజాల సర్కిల్‌లో అదనపు ఫీల్డర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అతను క్రీజ్ వదిలి షాట్స్ ఆడాడు, ఖాళీ స్థలాలు వెతుక్కున్నాడు. 20 లేదా 30 రన్స్ చేసేవాళ్లు 80, 90 లేదా 100 రన్స్ చేయాలి' అని అన్నాడు.