ఊర్వశి రౌతేలా ఎవరో నాకు తెలీదు.. ఆమెతో ముఖ పరిచయం కూడా లేదు - పాక్ క్రికెటర్ నసీమ్
ఊర్వశి రౌతేలా అంటే ఎవరో నాకు తెలియదని, ఆమెతో ముఖ పరిచయం కూడా లేదని పాకిస్తాన్ యువ క్రికెటర్ నసీమ్ అన్నారు. ఆమె ఎందుకు అలా వీడియో షేర్ చేసిందో కూడా తనకు తెలియడం లేదని చెప్పారు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరు ప్రస్తుతం మారుమోగుపోతోంది. పాకిస్తాన్ క్రికెటర్ నసీమ్ షాతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఆసియాకప్ లో భారత్ పాక్ జట్టు ఆడుతున్న మ్యాచ్ ను వీక్షిస్తూ ఊర్వశి ఇటీవల స్టేడియంలో కనిపించింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఊర్వశితో నసీమ్ పేరు చక్కర్లు కొడుతోంది.
ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం
అయితే ఈ గాసిప్ప్ పై పాక్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా స్పందించారు. ఈ విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు ఊర్వశి అంటే ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. ఓ ప్రశ్నకు సమాధానంగా ‘‘ ఊర్వశి ఎవరో కూడా నాకు తెలియదు. ఆమెతో నాకు ముఖ పరిచయం కూడా లేదు. నా దృష్టి అంతా ఇప్పుడు క్రికెట్ పైనే ’’ అని అన్నారు.
ఊర్వశితో ఉన్న అనుబంధంపై వ్యాఖ్యానించాలని మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘ అలాంటి ప్రణాళిక లేదు. ఊర్వశి ఎవరో నాకు తెలియదు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు చిరునవ్వు వస్తోంది. ఆమె ఎలాంటి వీడియోలను షేర్ చేస్తుందో నాకు తెలియదు. నా దగ్గర అలాంటి ప్లాన్ లేదు. ప్రస్తుతం క్రికెట్ పైనే దృష్టి ఉంది. క్రికెట్ మాత్రమే బాగా ఆడాలని ఉంది.’’ అని అన్నారు.
ప్రధానిని ప్రస్తావిస్తూ బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై ప్రశ్నలు.. మోడీపై శరద్ పవార్ విమర్శలు
‘‘నిజం చెప్పాలంటే దీని గురించి నాకు ఏమీ తెలియదు. మైదానంలో నా ఆట నేడు ఆడతాను. నాకేమీ ఆలోచన లేదు. మైదానంలోకి వచ్చి మ్యాచ్ చూసే వారి దయ. ఎవరైతే నన్ను ఇష్టపడతే అది వారి మంచి విషయం. నా విషయానికి వస్తే అది మంచి విషయం. నేను ఏ ఆకాశం నుండి రాలేదు.? నాలో ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ప్రజలు ఇష్టపడష్ట తారు, కాబట్టి ఇది మంచి విషయం. ’’ అని తెలిపారు.
సెప్టెంబర్ 4వ తేదీన ఇండో-పాక్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఊర్వశి వచ్చింది. మ్యాచ్ అనంతరం ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నసీమ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నసీమ్ మైదానంలో నవ్వుతూ కనిపించగా ఊర్వశి అతనిని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. ఈ వీడియోతో ఊర్వశి రౌతేలా ఫ్యాన్ పేజీ రూపొందించింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెల్లుత్తాయి. కాగా.. ఊర్వశి, భారత క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే.