ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 : ఓటమితో గ్రాండ్ స్లామ్ కెరీర్ను ముగించిన సానియా మీర్జా..
మెల్బోర్న్లో రోహన్ బోపన్నతో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా తన కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ మ్యాచ్లో ఓడిపోయింది.
భారత అత్యుత్తమ మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జనవరి 27 శుక్రవారం మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ 2023లో భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ లో ఓటమి చవిచూసింది. తన 18 ఏళ్ల గ్రాండ్స్లామ్ కెరీర్ను ఈ ఓటమితో ముగించింది. టైటిల్ పోరులో మీర్జా-బోపన్న జోడీ 7-6 (2), 6-2తో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది.
దుబాయ్లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సానియా, ఆస్ట్రేలియన్ ఓపెన్లో తన కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతోంది. మాజీ డబుల్స్ ప్రపంచ నం. 1 మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్స్, మూడు మహిళల డబుల్స్ టైటిల్స్తో అద్భుతమైన కెరీర్ ఉన్న సానియా ఓ ఓటమితో తన కెరీర్ ను ముగించింది.
సానియా మీర్జా తన కెరీర్లోని చివరి గ్రాండ్స్లామ్ మ్యాచ్లో హార్ట్ బ్రేక్ ఎదుర్కొంది, రోహన్ బోపన్నతో కలిసి - బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ/రాఫెల్ మాటోస్తో వరుస సెట్లలో ఓటమిని ఎదుర్కొంది. గంటపాటు జరిగిన ఫైనల్లో భారత జోడీ 6-7, 2-6తో బ్రెజిల్ ద్వయం చేతిలో ఓడిపోయింది. ఇదే తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అని మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్కు ముందు ప్రకటించింది. భారత టెన్నిస్ స్టార్ దుబాయ్ ఓపెన్ తర్వాత ఫిబ్రవరిలో క్రీడల నుండి రిటైర్ అవుతారు.