Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: పాకిస్తాన్‌ని చిత్తు చేసి, ఫైనల్ చేరిన భారత కబడ్డీ జట్టు... మహిళా కబడ్డీ టీమ్ కూడా

పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-14 తేడాతో ఘన విజయం అందుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టు... నేపాల్‌ని ఓడించి ఫైనల్ చేరిన మహిళా కబడ్డీ జట్టు.. 

Asian Games 2023: Indian kabaddi teams reaches Finals,  HS Prannoy wins Bronze medal CRA
Author
First Published Oct 6, 2023, 2:10 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్ అదరగొడుతోంది.  భారత పురుషుల కబడ్డీ జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరింది. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-14 తేడాతో ఘన విజయం అందుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టు, ఫైనల్‌కి ప్రవేశించింది..

మహిళా కబడ్డీ జట్టు కూడా ఫైనల్‌కి ప్రవేశించింది. నేపాల్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 61-17 తేడాతో ఘన విజయం అందుకుని ఫైనల్ చేరింది భారత మహిళా కబడ్డీ జట్టు. చైనీస్ తైపాయ్‌తో రేపు 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత మహిళా కబడ్డీ జట్టు.. 

ఉమెన్ రేగు సెపక్టక్రా పోటీల్లో సెమీస్ చేరిన భారత జట్టు, కాంస్య పతకం గెలిచింది. సెమీ ఫైనల్‌లో థాయిలాండ్ చేతుల్లో 0-2 తేడాతో ఓడింది. భారత పురుషుల ఆర్చరీ రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. అథాను దాస్, బీరాజ్, తుషార్ 5-3 తేడాతో బంగ్లాదేశ్‌ని ఓడించారు.. భారత జట్టు, సౌత్ కొరియాతో రేపు ఫైనల్‌లో తలబడనుంది. 

బ్యాడ్మింటన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సెమీ ఫైనల్ చేరిన హెచ్‌.ఎస్ ప్రణయ్, ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ లి షిఫెండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15-21, 9-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. అయితే సెమీస్ చేరిన ప్రణయ్‌కి కాంస్య పతకం దక్కింది..

రెజ్లింగ్‌లో భారత్‌కి ఆశించిన ఫలితం రాలేదు. భజరంగ్ పూనియా, ఆమన్ సెహ్రావత్, సోనమ్, కిరణ్ సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయారు. అయితే ఈ నలుగురు కాంస్య పతకం కోసం పోరాడబోతున్నారు. 

ఆర్చరీలో మహిళల రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో అంకితా భకత్, భజన్ కౌర్, సిమ్రాన్‌జీత్ కౌర్, వియాత్నంతో జరిగిన మ్యాచ్‌లో 6-2 తేడాతో గెలిచి కాంస్యం గెలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios