Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ టీమ్.. పాకిస్తాన్‌ని చిత్తు చేసిన హాకీ టీమ్..

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-2 తేడాతో విజయాన్ని అందుకున్న భారత పురుషుల హాకీ జట్టు... తొలిసారి బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కి టీమిండియా.. 

Asian Games 2023: India beats Pakistan in Hockey, Indian Badminton men's team reaches finals CRA
Author
First Published Sep 30, 2023, 8:38 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఉజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 16-0 తేడాతో విజయాన్ని అందుకున్న భారత హాకీ టీమ్, సింగపూర్‌తో మ్యాచ్‌లో 16-1 తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది టీమిండియా..

ఇందులో భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించాడు. ఉదయం స్క్వార్ష్‌ పురుషుల టీమ్ ఈవెంట్‌లో 2-1 తేడాతో పాకిస్తాన్‌ని ఓడించిన భారత జట్టు, సాయంత్రం హాకీలోనూ చిత్తు చేసింది. అదే విధంగా U19 SAFF ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో 3-0 తేడాతో ఓడిపోయింది. 


టేబుల్ టెన్నిస్‌లో భారత మహిళల జోడి అహీకా ముఖర్జీ- సుత్రితా ముఖర్జీ సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో వరల్డ్ ఛాంపియన్స్ చైనాపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది భారత జోడి. ఏషియన్ గేమ్స్‌ చరిత్రలో భారత టీటీ మహిళలు డబుల్స్‌లో ఇప్పటిదాకా పతకం గెలవలేదు. ఈసారి దాన్ని బ్రేక్ చేయబోతున్నారు అహీకా ముఖర్జీ- సుత్రితా ముఖర్జీ..

బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు,మొట్టమొదటిసారిగా ఫైనల్‌కి ప్రవేశించింది. కొరియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయాన్ని అందుకుంది భారత పురుషుల బ్యాడ్మింటన్ టీమ్. మొదటి మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, తన ప్రత్యర్థి జోన్ హెవోక్ జిన్‌పై 18-21, 21-16, 21-19 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. దీంతో 1-0 తేడాతో ఆరంభించింది భారత జట్టు.

అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 13-21, 24-26 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో లక్ష్యసేన్, 21-7, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్నాడు. 

నాలుగో మ్యాచ్‌లో అర్జున్- ద్రువ్ కపిల 16-21, 11-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయారు. దీంతో స్కోర్లు 2-2 తేడాతో సమం అయ్యాయి. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌ని కిడాంబి శ్రీకాంత్ 12-21, 21-16, 21-18 తేడాతో సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్‌లో ఓడిపోయిన తర్వాత ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి, విజయాన్ని అందుకున్న శ్రీకాంత్, భారత బ్యాడ్మింటన్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు.. రేపు చైనాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత బ్యాడ్మింటన్ జట్టు.. 

Follow Us:
Download App:
  • android
  • ios