ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మరో 3 బంగారు పతకాలు సాధించింది. దీంతో మొత్తం 8 బంగారాలు సొంతం చేసుకుంది. 5000 మీటర్లలో గుల్వీర్, హైజంప్లో పూజ బంగారం, స్టీపుల్చేజ్లో పారుల్ జాతీయ రికార్డుతో రజతం గెలిచారు.
Asian Athletics Championships 2025 : సౌత్ కొరియాలోని గుమీలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం మూడు బంగారు పతకాలు సాధించారు. దీంతో భారత్ మొత్తం 18 పతకాలు (8 బంగారం, 7 రజతం, 3 కాంస్యం) సాధించింది.
హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్ సింగ్ 5000 మీటర్లలో బంగారం సాధించాడు. 26వ ఆసియా ఛాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా అతడు నిలిచాడు. మొదటిరోజే 10,000 మీటర్లలో ఇతడు బంగారు పతకం గెలిచాడు. "5000, 10,000 మీటర్లలో బంగారం గెలవాలనేది నా లక్ష్యం. ఈ పతకాల గెలుపుపట్ల సంతోషంగా ఉంది" అని గుల్వీర్ అన్నాడు.
గుల్వీర్ వరల్డ్ రికార్డ్
5000 మీటర్ల పరుగులో గుల్వీర్, థాయ్లాండ్కు చెందిన కీరన్ టున్టివేట్, జపాన్కు చెందిన నాగియా మోరి మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరి రెండు ల్యాప్లలో గుల్వీర్ అద్భుతంగా పరుగెత్తి బంగారం గెలిచాడు. అతని సమయం 13:24.77. 2015లో ఖతార్కు చెందిన అల్ గార్ని మొహమ్మద్ సృష్టించిన ఆసియా ఛాంపియన్షిప్ రికార్డు (13:34.47)ను అతను బద్దలు కొట్టాడు.
పారుల్ చౌదరికి రజతం
మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో పారుల్ చౌదరి జాతీయ రికార్డు (9:12.96)ను మెరుగుపరిచి రజతం గెలిచింది. "కజకిస్తాన్కు చెందిన నోరా జెరుటో టానుయ్తో పోటీ పడటం కష్టమైంది. జాతీయ రికార్డును మెరుగుపరచడం సంతోషంగా ఉంది" అని పారుల్ అన్నారు.
నందిని అగసరకు బంగారం
హెప్టాథ్లాన్లో నందిని అగసర బంగారం గెలిచింది. చివరి రోజు మరిన్ని పతకాలు గెలిచే అవకాశం ఉంది. 200 మీటర్ల ఫైనల్కు నిత్య గాంధే, జ్యోతి యర్రాజీ; 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్కు విత్య రామరాజ్, అను ఆర్; 800 మీటర్ల ఫైనల్కు అను కుమార్, కృష్ణన్ కుమార్, ట్వింకిల్ చౌదరి, పూజ; 200 మీటర్ల ఫైనల్కు అనిమేష్ కుజుర్ అర్హత సాధించారు. శచీన్ యాదవ్, యశ్వీర్ సింగ్ జావెలిన్ త్రో ఫైనల్కు అర్హత సాధించారు.