Neeraj Chopra : నీరజ్ చోప్రా 2023 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 2022లో ఈ టోర్నీలో రజత పతకాన్ని అందుకున్నాడు. 2022 డైమండ్ లీగ్లో ఛాంపియన్గా నిలిచాడు. 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఛాంపియన్గా నిలవడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇప్పుడు పారిస్ లో ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.