Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామమందిరం : గుడిని వ్యతిరేకించినవారిని ఇబ్బందుల్లో పడేసిన రామయ్య.. చిక్కుల్లో I.N.D.I.A...

శ్రీరాముడు తనకు గుడి కట్టడాన్ని వ్యతిరేకించిన వారందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ పార్టీలు తీసుకున్న నిర్ణయాల పరిణామాలు రానున్న వారాల్లో తేలనుంది అంటున్నారు ఎస్ గురుమూర్తి..

Ayodhya Ram Temple: Ramaiah who put the opponents of the temple in trouble.. I.N.D.I.A. is in trouble - bsb
Author
First Published Jan 31, 2024, 1:14 PM IST

అయోధ్య : ఐదు శతాబ్దాల హిందువుల కల సాకారం చేస్తూ గత అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యింది. ఈ జనవరి 22న ఎంతో వైభవంగా ప్రారంభోత్సవం, బాలరాముడిప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. దేశవిదేశాల్లో ఉన్న హిందువులు ఎంతో భక్తితో, ఆసక్తితో ఈ వేడుకల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగం అయ్యారు. ఈ మందిరాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మించింది. మందిర ప్రారంభోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలనూ ఆహ్వానించింది. 

రామజన్మ భూమి ఉద్యమానికి నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, విపక్ష నేతలందరినీ, రామ మందిరం నిర్మాణంపై కేసు వేసిన ముస్లిం నేతలకూ ఆహ్వానాలు పంపింది. రాజకీయాలకు అతీతంగా వేడుకను నిర్వహించింది. 

ఈ వేడుకకు ఆహ్వానం అందడం హిందూ వ్యతిరేక, మోడీ వ్యతిరేక పార్టీలను చిక్కుల్లో పడేసింది. ప్రాణ ప్రతిష్టా వేడుకకు హాజరుకావాలా? వద్దా? అనే ప్రధాన సందిగ్ధంలో పడిపోయాయి. దీంతో ముఖ్యంగా I.N.D.I కూటమికి మరింత ఇబ్బంది కలిగింది. ఇదెందుకు జరిగింది. దీనికి కారణాలేంటీ అంటే.. రామజన్మ భూమి ఉద్యమం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి... 

300 ఏళ్ల కృషి
300 సంవత్సరాలకు పైగా హిందూ సమాజం అయోధ్య రామజన్మభూమి కోసం యుద్దాలు, దౌత్యాలు చేశారు. మరాఠా పాలనలో దౌత్యంతో పరిష్కరించుకోవాలని చూశారు. ఆంగ్లేయుల కాలంలో చట్టపరమైన మార్గాల ద్వారా శ్రీరాముని జన్మస్థలాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి పోరాటం 1980లలో ప్రజా ఉద్యమంగా మారింది. జయలలిత నేతృత్వంలోని ఎడిఎంకె, బిజెపి, శివసేన మూడు పార్టీలు మాత్రమే ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. 

‘రామ మందిరం ఉద్యమం లౌకికవాదాన్ని నాశనం చేస్తుంది’ అంటూ అప్పట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం, ఇతర లౌకికవాద పార్టీలు ఉద్యమాన్ని అణిచివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా పి.వి. నరసింహారావు ప్రభుత్వం అనేకవిధాలా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ముస్లింలు ప్రార్థనలు చేయని బాబ్రీ మసీదును సెక్యులరిస్టులు సెక్యులరిజానికి ప్రతీకగా మార్చారు.

రామ మందిరం నిర్మించాలన్న హిందువుల న్యాయబద్ధమైన డిమాండ్‌ను సెక్యులర్ పార్టీలు, పాలకులు తిరస్కరించారు. దీంతో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. బిజెపి హిందూ రాజకీయాలు దాని నుండి పరిణామం చెందాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేకత లౌకికవాద రాజకీయాల శైలిగా మారింది. ఆ నేపథ్యంలోనే వచ్చే 2024 ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా ఐఎన్‌డీఐ కూటమి ఏర్పడింది.

హాజరుకావాలా వద్దా!
2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం ప్రతిపక్ష పార్టీలకు అందింది. యావత్ హిందూ సమాజం ఉత్కంఠగా ఎదురుచూసిన రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానం అందడంతో I.N.D.I కూటమి పార్టీలు సందిగ్ధంలో పడ్డాయి. కలిసి ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ స్టార్ కూటమిలోని ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. మైనారిటీ ఓట్లతో పాటు మత విశ్వాసాలు లేని వామపక్షాలు ప్రాణ ప్రతిష్ట వేడుకను బహిరంగంగా బహిష్కరించారు. కాంగ్రెస్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది. వేడుకకు వెళితే తమ సెక్యులరిజం దెబ్బతింటుందని భయపడ్డారు.

వామపక్షాల మాదిరిగా రామ మందిరం ఆహ్వానాన్ని తిరస్కరించే ధైర్యం ఉందా అని కేరళ ముస్లిం లీగ్ నాయకత్వం ప్రశ్నించింది. 2024 ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న వాయనాడ్ నియోజకవర్గం నుంచి మాత్రమే రాహుల్ గెలవాలి. ఇదికాకుండా, ఉత్తరాది రాష్ట్రాల్లో హిందువులకు అనుకూలమైన పార్టీగా బిజెపిని ప్రముఖంగా పరిగణించినప్పటికీ, ప్రజలు కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేక పార్టీగా పరిగణించరు. నేటికీ కాంగ్రెస్‌కు అత్యధిక ఓటర్లు హిందువులే. చాలా మంది రామమందిరానికి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, ప్రాణ ప్రతిష్టను విస్మరించడం ద్వారా, కాంగ్రెస్‌ను “హిందూ వ్యతిరేక పార్టీ” అని బిజెపి ఆరోపించిన దానితో ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. రామజన్మ భూమి ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర "ప్రారంభోత్సవానికి రావద్దనే" కాంగ్రెస్ నిర్ణయం ద్వారా బట్టబయలైంది.

యూపీలో ఐఎన్‌డీఐ కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ శ్రీరాముని ఆలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1990లో రామభక్తులపై కాల్పులు జరపడంతో పెద్దసంఖ్యలో కరసేవకులు మరణించారు. హిందువుల ఓట్లను కైవసం చేసుకుంటూ ములాయం కుమారుడు అఖిలేష్ మాట్లాడుతూ “బీజేపీ హిందుత్వాన్ని ఎదుర్కోవాలంటే మనకు మృదువైన హిందుత్వం కావాలి”. ఒకవైపు ఈ వేడుకలో పాల్గొంటే తనకు కావాల్సిన ముస్లిం ఓట్లు పడతాయో లేదోనన్న సందేహంలో అఖిలేష్ చిక్కుకున్నారు. మరోవైపు, అతను పాల్గొనకపోతే, ఆయనమీద, అయన పార్టీ మీద హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయబడుతుంది. 

మొత్తంగా, ములాయం సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఆదేశాల మేరకు రామ మందిరంపై దాడులు, కరసేవకులపై కాల్పులు జరిపిన అన్నింటినీ గుర్తుచేసుకోవడానికి బిజెపికి ఇది ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి, అఖిలేష్ వేడుకకు హాజరుకాలేకపోవడాన్ని దాటవేసాడు. అయితే, ఆ తరువాత ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పాడు. రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ చేపట్టిన యాత్రను రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. ఎల్.కె. అద్వానీని అప్పటి ఆర్జేడీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ఆహ్వానం అందడంతో సమాజ్‌వాదీ పార్టీ కంటే ఆయన పార్టీ ఇబ్బంది పడింది. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని పట్టించుకోనప్పటికీ, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ మాత్రం.. త్వరలో అయోధ్యను సందర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రాజకీయంగా ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ కూడా సాగుతోంది. చివరగా, శ్రీరాముడు తనకు ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకించిన వారందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ పార్టీలు తీసుకుంటున్న నిర్ణ‌యాల ప‌రిణామాలు వ‌చ్చేవారంలో తెలియ‌నున్నాయి.

పాఠకులకు గమనిక : ఈ వ్యాసం మొదట తుగ్లక్ తమిళ వీక్లీ మ్యాగజైన్‌లో వచ్చింది. ఇది www.gurumurthy.net కోసం తుగ్లక్ డిజిటల్ ద్వారా ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. దీనిని ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌లో రీప్రొడ్యూస్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios