షియోమి నుంచి మరో స్మార్ట్ టీవీ
- బడ్జెట్ ధరలో షియోమి స్మార్ట్ టీవీ
చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి నుంచి మరో స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారత మార్కెట్లో షియోమి బ్రాండ్ కి డిమాండ్ ఎక్కువ. ఇటీవల షియోమి.. రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రెండు ఫోన్ల విడుదల సమయంలోనే.. తొలిసారి స్మార్ట్ టీవీని భారత్ కి పరిచయం చేసింది.
కాగా.. తాజాగా మరో స్మార్ట్ టీవీని తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే చైనాలో విడుదల చేసింది. ఎంఐ టీవీ4ఏ పేరిట విడుదల చేస్తున్న ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.17,500గా ఉండనుంది. మార్చి 7న మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా షియోమీ ఎంఐ టీవీ 4ఏ లో 40 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, వాయిస్ కంట్రోల్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, హెచ్డీఎంఐ, ఈథర్నెట్ పోర్టులు, డాల్బీ డీటీఎస్ ఆడియో, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.