ఈ నెల 21వ తేదీన రాజ్ భవన్ లో ఆయనను సన్మానించనున్నారు దిల్ కుషా అతిథి గృహంలో వెంకయ్యనాయుడికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలంగాణ ప్రభుత్వం పౌరసన్మానం చేయనుంది. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఈ నెల 21వ తేదీన రాజ్ భవన్ లో ఆయనను సన్మానించనున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కి తెలియజేసినట్లు సమాచారం.

ఈ నెల 11న ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకవాలనుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల కారణంగా హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును ప్రకటించినప్పటి నుంచి ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఎన్నికల్లోనూ ఆయనకే ఓట్లు కూడా వేశారు.ఈ నేపథ్యంలో ఈ పౌర సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. సన్మానం అనంతరం దిల్ కుషా అతిథి గృహంలో వెంకయ్యనాయుడికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు.