బంగారం ధర ఎంత పెరిగిదంటే
- అంతర్జాతీయ డిమాండ్ తో అనూహ్యంగా పెరిగిన ధరలు
గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు అనూహ్య రీతిలో పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీ డిమాండ్ నెలకొనడంతో ధర పెగిగింది. ఈ రోజు బులియన్ మార్కెట్ లో10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రామలు బంగారం ధర రూ.29,350 గా నమోదైంది.
ఇక వెండి ధర కూడా ఇదే రీతిలో పెరిగింది. చాలా రోజుల తర్వాత కిలో వెండి ధర రూ. 40 వేల మార్కును దాటింది. ఈ రోజు కిలో వెండి ధర రూ. 550 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 41 వేలుగా ఉంది.
దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.25శాతం పెరిగి 1,247.30 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 0.20 శాతం పెరిగి 17.55డాలర్లకు చేరింది.