బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇలా..
- ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు విశాఖపోర్టుకు నిధులు కేటాయించినట్లు జైట్లీ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఏపీ ప్రజలను తీవ్ర నిరాశ పరిచింది. విశాఖ రైల్వే జోన్ విషయంపై స్పష్టత వస్తుందని అందరూ భావించినా.. కేంద్రం దాని ఊసే ఎత్తలేదు. ఏపీకి సంబంధించి మెగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఏపీకి రావాల్సిన విభజన రావాల్సిన హక్కులు, హామీలపై ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు విశాఖపోర్టుకు నిధులు కేటాయించినట్లు జైట్లీ ప్రకటించారు.
ఏపీ కేటాయింపులు ఇవే:
1.విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
2.ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
3.ఏపీలో ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లుఏపీ ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు
4.ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్కు రూ.5కోట్లు
6.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకు రూ.32 కోట్లు
7.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.19.62 కోట్లు
8.ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లుఏపీ నిట్కు రూ.54 కోట్లు