శశికళ ను తొలగిస్తే కొంప మునుగుతుంది
ఎఐఎడిఎంకె నుంచి శశికళను తొలగించడం కష్టమంటున్నారు బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి
ఎఐడిఎంకె నుంచి జైలులో ఉన్న ప్రధాన కార్యదర్శి శశికళను తొలగించే అవకాశం లేదని బిజెపి రాజ్యసభ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అది ఆచరణ లో కష్టమని వ్యాఖ్యానించారు. ఒకవేళ తొలగిస్తే శశికళ తన 40 మంది ఎంఎల్ఎలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని పడగొడుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యాహ్నం రెండు గంటలకు తన ఎంఎల్ఎలతో ఆమె మేనల్లుడు దినకరన్ తో సమావేశం అవుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి