Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక ప‌త‌నం కొన‌సాగుతోంది

  • భారీ లక్ష్య ఛేదన లో తడబడుతున్న లంక.
  • నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
srilanka batsmans queue to pevilian

 శ్రీలంక వికెట్ల పతనం కొనసాగుతోంది. 72 ప‌రుగుల వ‌ద్ద నాలుగవ వికెట్ కోల్పోయింది. తిరుమ‌న్నే 18 ప‌రుగుల వ‌ద్ద పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అంత‌కు ముందు 37 పరుగుల వ‌ద్ద‌ మున‌వీర్ వికెట్ ప‌డింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన‌ లంక తొలి రెండు ఓవర్లలో దూకుడుగా ఆడినప్పటికీ మూడో ఓవర్ నుంచి వికెట్ల పతనం మొదలైంది. 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక 26 పరుగుల వద్ద రెండో వికెట్‌ను చేజార్జుకుంది. తర్వాత మరో 11 పరుగులు జోడించాక బుమ్రా బౌలింగ్‌లో మునవీర (11) ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 20  ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

 

మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios