Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి శాంసంగ్ ఎస్9, ఎస్9+

ఈరోజు నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం

Samsung Galaxy S9 Galaxy S9+ India Launch Set for Today

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు ఈరోజు(మంగళవారం) భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇటీవల బార్సిలోనాలో ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్2018’ ప్రదర్శన జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిలో శాంసంగ్.. గెలాక్సీఎస్9, గెలాక్సీ ఎస్9+ పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఈ రోజు మన మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఈ సందర్భంగా వీటి ధరలను కూడా కంపెనీ ప్రకటించింది.

ఈ రెండు ఫోన్లు 64జీబీ, 256జీబీ రెండు వేరియంట్లలో లభ్యమౌతున్నాయి. 64జీబీ సామర్థ్యం గల గెలాక్సీ ఎస్9 ఫోన్ ధర రూ.62,500, 256జీబీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.71,000గా ప్రకటించారు. ఇక 64జీబీ సామర్థ్యం గల గెలాక్సీ ఎస్9+ ఫోన్ ధర రూ.70,000, 256జీబీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.79వేలుగా ప్రకటించారు. మంగళవారం ఈ ఫోన్ల ప్రీబుకింగ్  ప్రారంభం అవుతోంది. ప్రీబుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ.2వేలు అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎస్9 ఫీచర్లు..

5.8 ఇంచెస్ క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ/256జీబీ సామర్థ్యం, 12మెగాపిక్సెల్ వెనుక కెమేరా, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్

గెలాక్సీ ఎస్9+ ఫీచర్లు..

6.2 ఇంచెస్ క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 64జీబీ/256జీబీ సామర్థ్యం, 12మెగాపిక్సెల్ డ్యూయల్ కెమేరా, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్

Follow Us:
Download App:
  • android
  • ios