Asianet News TeluguAsianet News Telugu

సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్

  • సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్
  • భారత మార్కెట్ లోకి సామ్ సంగ్ గెలాక్సీఏ8+
Samsung Galaxy A8+  India Launch Today

నూతన సంవత్సరంలో సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. బుధవారం ఈ ఫోన్ ని లాంఛనంగా విడుదల చేస్తున్నారు. సామ్ సంగ్ గెలాక్సీ ఏ8+ పేరిట ఈ ఫోన్ ని విడుదల చేస్తున్నారు. వియత్నాంలో ఇటీవలే ఈ ఫోన్ ని విడుదల చేయగా.. భారత్ లో బుధవారం అడుగుపెడుతోంది. దీని ధర రూ. 38వేలు గా కంపెనీ ప్రకటించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.

సామ్ సంగ్  గెలాక్సీ ఏ8+ ఫీచర్లు..

6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ప్లే

ఆక్టాకోర్ ప్రాసెసర్

7.1.1 నగౌట్ ఆండ్రాయిడ్

6జీబీ ర్యామ్

64జీబీ ఇన్బుల్ట్ స్టోరేజ్

3500ఎంఏకహెచ్ బ్యాటరీ సామర్థ్యం

16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

16మెగా పిక్సెల్ వెనుక కెమేరా

8 మెగా పిక్సెల్ వెనుక కెమేరా

మైక్రో ఎస్ డీ కార్డ్ సదుపాయం కలదు

Follow Us:
Download App:
  • android
  • ios