Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మీనోట్5 సెకండ్ సేల్ ప్రారంభం

  • సెకండ్ సేల్ ప్రారంభించిన షియోమి కంపెనీ
Redmi Note 5 Redmi Note 5 Pro second sale on Flipkart Xiaomis official website

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి ఫోన్లు భారత మార్కట్ లో డిమాండ్ చాలా ఎక్కువ. ఇటీవల షియోమి.. రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట రెండు ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లను గతవారం(ఫిబ్రవరి 22వ తేదీన) మార్కెట్లోకి విడుదల చేయగా.. కేవలం మూడు నిమిషాల్లో 3లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని షియోమి అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఫోన్లు లభించని కష్టమర్లు మాత్రం చాలా నిరాశకు గురయ్యారు.

దీంతో..షియోమి మరోసారి ఈ ఫోన్ల సేల్ ప్రారంభించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్, ఎంఐ అధికారిక వెబ్ సైట్ లో ఈసేల్ ను ప్రారంభించారు. ఈ సేల్ లో ఈ రెండు ఫోన్లతోపాటు ఎంఐ టీవీ4 కూడా అందుబాటులో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios