ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలో..
- ఒప్పో ఏ83 పేరిట విడుదల చేస్తున్నారు
- ఈనెల 20న భారత మార్కెట్ లోకి
చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ ఒప్పో.. భారత మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెట్టనుంది. ఒప్పో ఏ83 పేరిట ఈ ఫోన్ ని విడుదల చేయనుంది. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ లో ఈ ఫోన్ ని చైనాలో విడుదల చేయగా.. భారత్ లో ఈనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. రెండు రంగుల్లో ఇది లభ్యం కానుంది. దీని ధర రూ.13,900గా ప్రకటించారు.
ఒప్పోఏ83 ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
5.70 ఇంచెస్ డిస్ప్లే
2.5గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా
13 మెగాపిక్సెల్ వెనుక కెమేరా
4జీబీ ర్యామ్
ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్
32జీబీ స్టోరేజ్ సామర్థ్యం
3180ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం