గత ఏడాది భక్తులకు10.46 కోట్ల తిరుపతి లడ్డూలను అందించారు
గత ఆర్థిక సంవత్సరంలో శ్రీవారిని 2.68కోట్ల మంది దర్శించుకున్నారనితిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో సాంబశివరావు తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్లో తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గంట సమయంపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో ఫోన్లో మాట్లాడి వారికి ఎదురైన సమస్యలు తెలుసుకున్నారు.
వారుఅందించిన సూచనలను తీసుకున్నారు.
భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులనుపరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,038కోట్లఆదాయం వచ్చిందని... భక్తులకు10.46కోట్ల లడ్డూలను అందించామన్నారు.
అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.114కోట్లవిరాళం వచ్చిందని సాంబశివరావు తెలిపారు.
ఆన్లైన్ద్వారా విడుదల చేసే ఆర్జిత సేవాటిక్కెట్లను డిప్ ద్వారా విడుదలచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
