మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా ఒలోడార్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సందడి చేశారు. తెలుగు ప్రిన్సెస్‌ ట్రెడిషనల్‌ కల్చరల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు  ఆమె కాకినాడ వచ్చారు.

మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎస్మా ఒలోడార్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సందడి చేశారు. తెలుగు ప్రిన్సెస్‌ ట్రెడిషనల్‌ కల్చరల్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె కాకినాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సాంబమూర్తినగర్‌లోని ప్రభుత్వ బధిరుల ఉన్నత పాఠశాలను సందర్శించారు. వారితో కలిసి సందడి చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బధిర విద్యార్థులతో కేవలం సైగలతోనే ఆమె మాట్లాడటం విశేషం. ఆమెతో పాటు ఫ్యాషన్‌ డిజైనర్‌, గ్లోబర్‌ ఎడ్వైజర్‌ సతీష్‌ టిక్కర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఈవెంట్‌ మేనేజర్‌ శిరీష మాట్లాడుతూ యువతలో అందంతో పాటు సామాజిక సేవా స్పృహను పెంపొందించే లక్ష్యంగా కాకినాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే బధిరుల పాఠశాలను సందర్శించామన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు.