Asianet News TeluguAsianet News Telugu

అతి తక్కువ ధరలో మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్

  • స్మార్ట్ ఫోన్ ధర రూ.2వేల లోపే
Micromax Bharat Go with Android Oreo launching this month

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్.. మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమైంది. భారత్ గో పేరిట ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనున్నట్లు ఈ దేశీయ కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ని అత్యంత తక్కువ ధరకే అందించనున్నట్లు తెలిపింది. రూ.2వేల లోపే ఫోన్ ధర ఉంటుందని చెప్పింది. ఈ నెలాఖరుకి ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సందడి చేయనుంది.

ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఓఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 512 ఎంబీ లేదా 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 4 ఇంచ్ డిస్‌ప్లే, 5, 2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 1600 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో గూగుల్ గో, మ్యాప్స్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, ఫైల్స్ గో తదితర లైట్ వెయిట్ యాప్స్‌ ను ఇన్‌బిల్ట్‌ గా అందివ్వనున్నారు. కాగా మైక్రోమ్యాక్స్ విడుదల చేయనున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios