కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ
రామ్నగర్లో బీజేపీ అభ్యర్థి కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు.
లెక్కింపు పక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ , బీజీపీలకు ప్రతిష్టాత్మకంఆ ఉన్న ఈ ఎన్నికల పోరులో పోటీ హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాల సరళి కనిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజవర్గాల్లో వెనుకంజగా ఉండండం ఆరంభంలో కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనలో పడేసింది. అయితే క్రమంగా పుంజుకుంటున్న ధోరణి కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బాదామిలో సిద్ధరామయ్యపై శ్రీరాములు ఆధిక్యంలోకి వచ్చేశారు. ఆరంభంలో బాదామి, చాముండేశ్వరి రెండునియోజకవర్గాల్లో వెనుకబడి వున్నారు. రామ్నగర్లో బీజేపీ అభ్యర్థి కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు.