రాను రాను బతుకు ఛిద్రమవుతూ ఉంది. దేనికీ భరోసా లేదు. ఆసుప్రతి లేదు, చదువు లేదు, చేసేందుకు పనీపాట లేదు, చేసిన పనికి గిట్టుబాటు రాదు...ఈ బతకు జిఎస్ టి ఎలా బాగు పడ్తుందో బోధపడటం లేదు.ఒక కవి అవేదన.

Add Asianetnews Telugu as a Preferred Source

బతుకు ఛిద్రం
బతుకునిచ్చే బడిలేదు
భరోసనిచ్చే దావఖాన లేదు
బువ్వపెట్టే పనీపాట లేదు
80% గా వున్న ప్రజలను
ఈ మూడింటికి దూరం చేసి
ఎన్ని నోట్లు రద్దు చేస్తే ఏందీ ,
ఎన్ని GST లు తెస్తే ఏందీ
ఇవి ఎవడికి లాభం ?
ఎవడికి నష్టం ?
పండించిన పంటకు ధర ఉండదు
సదివిన సదువుకు కొలువుండదు
ఖాయిలాకు మందుండదు
చేసేందుకు పనీ దొరకదు
ఈ నాలుగు లేనిదే అభివృద్ధి ఉండదు,
ఏమంటావ్ మిత్రమా?
