ఐదుసార్లు డ్రా చేస్తే ఇక అంతే...
హెచ్డీఎఫ్సీ బ్యాంకు సంచలన నిర్ణయం
ఇకపై హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లినప్పుడు కాస్త ఆలోచించండి. కస్టమర్లకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది దేశంలోనే ఈ రెండో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు.
సేవింగ్స్ అకౌంట్స్ సర్వీసులపై భారీగా ఛార్జీలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకపై నెలకు నాలుగు సార్లు మాత్రమే హెచ్డీఎఫ్సీ నుంచి ఎటువంటి ఛార్జీ లేకుండా లావాదేవీలు జరుపవచ్చు.
అంతకు మించి జరిపితే ఒక్కో లావాదేవీపై మీ అకౌంట్ల నుంచి రూ. 150 కట్ చేస్తారు.
నోట్ల రద్దు అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది.