Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో గవర్నర్ దంపతుల దర్శనమిలా సాగింది

గురువారం నాడు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ స్వామిదర్శన భాగ్యం మహాద్భుతమన్నారు

governor given ceremonial reception at lord balaji temple

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పటికీ ” న భూతో న భవిష్యతి”, అని రాష్ట్ర గౌరవ గవర్నరు  ఈఎస్ ఎల్ నరసింహన్ ￰￰ఉధ్ఘటించారు.
గురువారం నాడు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ స్వామిదర్శన భాగ్యం మహాద్భుతమన్నారు.ప్రతి భక్తునికి దర్శనాన్ని కల్పించడంలో టీటీడీ అధికారులు నిరంతరం చేస్తున్న కృషిని అభినందించారు. స్వామివారి కృపతో అందరం ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలని ప్రార్థించానన్నారు.

అంతకు పూర్వం , ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తరువాత వరాహస్వామిని దర్శించుకున్నారు.
అటు తరువాత శ్రీవారి ఆలయ మహాద్వారం చేరుకున్నారు.ఆలయం చెంత టీటీడీ ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , తిరుమల జీవో శ్రీ కే ఎస్ శ్రీనివాస రాజు, సీవి ఎస్ ఓ శ్రీ ఆకే రవికృష్ణ స్వాగతం పలికారు .

అర్చక స్వాములు ఇస్తికఫాల్ స్వగతం పలికారు. గవర్నరు దంపతులు స్వామివారిని దర్శించు కున్నారు.

అనంతరం శ్రీ వరదరాజ స్వామిని , వకుళమాతను , అంగద సుగ్రీవ అనంత విష్వక్సేన గరుడాళ్వారులను, ఆనందానిలాయంపై వెలసి ఉన్న హయగ్రీవ, నరసింహ , విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.అటు తరువాత సబేరా , భాష్యకారులవారి సన్నిధి , యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు.
తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసారు.అనంతరం టీటీడీ ఈ ఓ, జేఈఓ లు స్వామివారి తీర్థ ప్రసాదాలను , చిత్రపటాన్ని , శేష వస్త్రాన్ని బహూకరించారు.

తిరుమలపెద్ద జీయర్ స్వామి , చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులలో ఒకరైన డా ఏ వి రమణ దీక్షితులు,ఉప కార్య నిర్వహణాధికారులు శ్రీ కోదండ రామ రావు , శ్రీ హరిద్రనాథ్ తదితర ఆధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios