Asianet News TeluguAsianet News Telugu

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

పసిడి ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది
Gold falls to Rs 31350; silver recovers by Rs 75 per kg

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం నాటి మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం.. నేటి మార్కెట్లో మరికాస్త తగ్గింది. రూ.200లు తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.75 పెరగడంతో కిలో వెండి రూ.39,050కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి స్వల్ప డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.30శాతం తగ్గడంతో ఔన్సు 1,322.20 డాలర్లు పలికింది.

Follow Us:
Download App:
  • android
  • ios