Asianet News TeluguAsianet News Telugu

చెరువులో పడి నలుగురు విద్యార్థులు గల్లంతు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
  • చెరువులో మునిగి నలుగురు విద్యార్థుల గల్లంతు
Four students drowned in the pond

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని వట్లూరు చెరువులో పడి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే ప్రస్తుతానికి ఒక్క శవం మాత్రం చెరువులో లభ్యమయ్యింది. 

Four students drowned in the pond

వివరాల్లోకి వెళితే  పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు లోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో విజయ్ శంకర్, హరి క్రిష్ణ రాజు, పరశురాం, కోట సాయి లు బిటెక్ 3 వ సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కలిసి ఇవాళ కాలేజీ సమీపంలో జామ తోటలోకి సరదాగా వెళ్లారు. అయితే అక్కడి నుండి తిరిగి వస్తుండగా వీరు ప్రమాద వశాత్తు చెరువులో పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Four students drowned in the pond

అయితే చెరువులో మాత్రం ఒక్కటే మృతదేహం దొరకడం, గట్టున మాత్రం నలుగురికి సంబంధించిన ఐడీ కార్డులు, బ్యాగులు లభించడం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెరువులో పడి మృతి చెందింది ఒకరా లేక నలుగురా అనేది సందిగ్ధంగా మారింది.  అయితే గుర్తింపు కార్డులు ఆధారంగా నలుగురూ మృతి చెంది వుంటారన్న అనుమానంతో చెరువులో పోలీసులు ఇంకా గాలింపు చేపట్టారు.  

Four students drowned in the pond

ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios