పరవశమై 50 లక్షలు వెదజల్లారు.. (వీడియో)
50 లక్షలు వెదజల్లారు.. (వీడియో)
ఏకంగా రూ. 50 లక్షలను ఓ వ్యక్తిపై వెదజల్లారు. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్లో చోటు చేసుకున్నది. గత రాత్రి వల్సాద్లో ఓ ఆద్యాత్మిక కార్యక్రమం జరిగింది. అతడి పాటకు పరవశమైన కొంతమంది 50 లక్షల విలువైన కరెన్సీని అతడిపై వెదజల్లారు. కరెన్సీ వర్షం కురిపించారు. అయినప్పటికీ.. ఆ వ్యక్తి అలాగే పాట పాడటం గమనార్హం. అందులో ఎక్కువగా కొత్తగా వచ్చిన పది రూపాయల నోట్లు, 500 నోట్లు కనిపించాయి. ఓవైపు వాటిని వెదజల్లుతుండగానే మరోవైపు వాటిని సంచుల్లో వేసి లెక్కించారు.
#WATCH Folk singers being showered with money, around Rs 50 lakhs, at a devotional programme in Valsad #Gujarat pic.twitter.com/54paGL0yhb
— ANI (@ANI) 19 May 2018