గద్వాల జిల్లాలోని కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
- గద్వాల జిల్లా కొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
- 50 లక్షల విలువ చేసే పత్తి దగ్ధం
జోగులాంబ గద్వాల జిల్లాలోని కొండపల్లి రహదారిలో ఉన్న జయలక్ష్మి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మిల్లులోని పత్తి భేళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రహాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
ఈ ప్రమాద సమయంలో మిల్లులో మొత్తం 4 కోట్ల విలువచేసే పత్తి ఉన్నట్లు యజమాని తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో మాత్రం 50 లక్షలు విలువచేసే పత్తి బేళ్లు దగ్ధమైనట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.