కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 29 న విడుదల అవుతుంది.
నామినేషన్ వేసేందుకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 9 నామినేషన్ల ఉప సంహరణకు గడువు.
పోలింగ్ ఆగస్టు 23న జరుగుతుంది.
ఓట్ల లెక్కింపు ఆగస్టు 28 న ఉంటుంది.
షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ మరుక్షణం నుంచి అమలులోకి వచ్చింది.
నంద్యాలలో శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి మృతితో ఎర్పడిన ఈ స్థానం ఖాళీ అయింది.
2014 ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి భూమా నాగిరెడ్డి టిడిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మీద గెలుపొందారు. గత ఏడాది ఫిబ్రవరిలో
భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. ఈ ఏడాది మార్చి 12న ఆయన గుండెపోటుతో మరణించారు.
ఇపుడు శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా నిలబడ్డారు.
రకరకాల కారణాలతో ఈ ఎన్నిక తెలుగుదేశం ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మీద రెఫరెండం అన్నట్లుగా సాగుతూ ఉంది.
అందుకే చాలా రోజులుగా షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.
ఇపుడు షెడ్యూల్ విడుదలయింది.
