టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభపై పోస్టు.. పోలీసు కేసు
టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే బొడిగ శోభకి చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. కాగా ఆ వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభపై కొడిమ్యాల తిరుపతి అనే వ్యక్తి ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే... దీనిపై స్థానిక పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు తిరుపతిపై కేసు నమోదు చేశారు. కాగా... ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.