Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్ రూం ఇళ్లలో అన్నీ లోపాలే...

ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య ధోరణి , బాధ్యతారాహిత్యం స్పష్టం

bhatti says TRS government 2bhk are substandard and people are worried

 

bhatti says TRS government 2bhk are substandard and people are worried

మధిర నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఇపుడు నియోజకవర్గ  పరిధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చింతకాని మండలం నాగులవంచకు చెందిన రైల్వే స్టేషన్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించారు. ఇళ్ళ నిర్మాణం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ఈ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్య దోరణి , బాధ్యతారాహిత్యం స్పష్టంగా కన్పిస్తుందన్నారు. మట్టి, ఇసుకతో కడుతున్నట్టు గా ఉందన్నారు. అందులోనూ రోడ్డు లెవెల్ కన్నా మరీ లోతట్టు ప్రాంతంలో జరుగుతున్న ఈ ఇళ్ళ నిర్మాణం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు అర్థం పడుతుంది.  పునాదులేకుండా నిర్మించే ఇళ్ల
 మనుగడ ప్రశ్నార్థకమన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాణ దశలోనే కూలిపోయేలా పనులు జరుగుతున్నా యి. ఈ ధోరణి మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గృహ నిర్మాణ శాఖ అజమాయిషీ పూర్తిగా లోపించిందన్నారు .  ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టో అర్థంకావడం లేదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios