మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. రూ.65కే ఓ ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.65తో రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ 3జీ/2జీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అయితే ఈ ప్లాన్ను మై ఎయిర్టెల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పలువురు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రత్యేక ఆఫర్ కింద ఈ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్లో లభించే మొబైల్ డేటాకు గాను ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 3జీ లేదా 2జీ మాత్రమే వస్తుంది. 4జీ స్పీడ్ లభించదు.