Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర ప్రదేశ్ లో ఇసుక తుఫాను... 11మంది మృతి

మరో 11మందికిపైగా గాయాలు

11 Killed As Dust, Thunderstorm Strikes Western Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను కారణంగా 11మంది మృతి చెందగా.. మరో 11 మందికి పైగా మృతి చెందారు. కేవలం బుధవారం సాయంత్రం వచ్చిన తుఫాను కారణంగానే వీరంతా మరణించడం గమనార్హం.

ఎత్వా, మధుర, అలిగర్, ఫిరోజాబాద్ ప్రాంతాల్లో ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాన్పూర్ లో ఓ వ్యక్తి పిడుగుపాటుకి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆగ్రాలో ఓ వ్యక్తి చెట్టు కూలి పడటంతో మృతిచెందాడు.

గత వారం రోజులుగా ఉత్తరప్రదేశ్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తూనే ఉంది.గతంలో ఈ తుఫాను కారణంగా 64మంది మృతిచెందగా.. మరో 160మంది గాయపడ్డారు. కాగా.. తాజాగా మరో 11మంది మృతిచెందారు. పక్క రాష్ట్రమైన రాజస్థాన్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios