జనవరి 18 నుంచి 26 వరకు విమాన సర్వీసుల్లో అంతరాయం రోజుకి 100 విమానాల చొప్పున రద్దు 9రోజుల పాటు  ఆంక్షలు

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు సుమారు వెయ్యి విమానాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి రోజూ గంటా 45 నిమిషాల పాటు ఏ విమానాలు వెల్లడానికి వీలు లేదని అధికారులు చెప్పారు. ఇదే విషయాన్ని అన్ని విమానయాన సంస్థలకు తెలియజేశాయి. ఉదయం 10గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 15 నిమిషాల వరకు 9 రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపేశారు. దీంతో.. ఆ సమయంలో ప్రతిరోజూ ప్రయాణించాల్సిన విమానాలను రద్దు చేశారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సమయంలో విమానాలను రీషెడ్యూల్‌ చేస్తారు కానీ, ఈ ఏడాది మాత్రం విమాన సర్వీసులను రద్దు చేశారు. ఏటా రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆరు రోజులు మాత్రమే ఇలా విమాన సేవలకు అంతరాయం ఏర్పడేది. కానీ ఈ ఏడాది దాన్ని తొమ్మిది రోజులకు పెంచారు. దీనిని రిపబ్లిక్‌ డే క్లోజర్‌ పీరియడ్‌ అని పిలుస్తారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred