Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్‌లో కీలక పదవికి ఎన్నికైన విజయసాయిరెడ్డికి.. కాంగ్రెస్, బీజేపీ సహా ఐదు పార్టీల మద్ధతు

పార్లమెంట్‌ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. శివసేన, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయనకు మద్ధతుగా నిలిచాయి.

ysrcp mp vijayasai reddy elected as member of public undertaking committee in parliament
Author
First Published Mar 29, 2023, 2:20 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్లమెంట్‌లో కీలక పదవి లభించింది. పార్లమెంట్‌ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ప్రయారిటీ 1 ఓట్లతో గెలిచారు విజయసాయిరెడ్డి. శివసేన, ఎన్‌సీపీ, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌లు ఆయనకు మద్ధతుగా నిలిచాయి. మొత్తం 7 ఖాళీలకు గాను 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. అలాగే పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బీజేపీ నేత లక్ష్మణ్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios