Asianet News TeluguAsianet News Telugu

మోస్ట్ పాపులర్ సీఎంలు: మూడో స్థానంలో జగన్, 9వ స్థానంలో కేసీఆర్

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు. యోగీ ఆదిత్యానాథ్ తొలి స్థానంలో నిలిచారు.

YS Jagan placed third most popualr CMs in India
Author
New Delhi, First Published Aug 8, 2020, 8:56 AM IST

న్యూఢిల్లీ: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. జులై 15 నుంచి 27వ తేదీకి మధ్య ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఆ వివరాలు వెల్లజయ్యాయి.

ఆ సర్వే ప్రకారం.... అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యానాథ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కు రెండో స్థానం దక్కింది.

19 రాష్ట్రాల్లోని 97 లోకసభ నియోజకవర్గాల్లో ఆ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 తేదీ మధ్య 12,021 మందిని టెలిఫోన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios