Wrestlers Protest: రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ రుజువైనా .. నేనే ఉరి వేసుకుంటానని ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఇద్దరు మైనర్లు సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలపై బిజెపి ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్య తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు దేశవ్యాప్తంగా మద్దుతు పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు, పలు సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.
తాజాగా యునైటెడ్ కిసాన్ మోర్చా (ఎస్కెఎం) కూడా మద్దతు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యునైటెడ్ కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ప్రకటించింది. సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆ సంస్థ డిమాండ్ చేసింది. అలాగే ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు సీనియర్ SKM నాయకులు వందలాది మంది రైతులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరసన ఇచ్చారు. నిరసన తెలిపే రెజర్లకు తమ మద్దతును అందిస్తామని తెలిపింది.
ఈ క్రమంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. తమపై ఉన్న ఒక్క ఆరోపణ అయినా రుజువైతే తాను ఉరివేసుకుంటానని వెల్లడించారు. ‘‘నాపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటాను. ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి ఆ విషయంపై పెద్దగా మాట్లాడలేను. ఈ విషయంలో తొలి రోజు నుంచి చెబుతున్నాను. నాకు వ్యతిరేకంగా ఏదైనా వీడియో, సాక్ష్యాలు బయటపెట్టాలి" అని అన్నారు. నేను ఏదైనా తప్పు చేశాశా అని ఇతర రెజర్లను అడగండి. 11 సంవత్సరాలుగా రెజ్లింగ్కు నా జీవితంలో అంకితం చేశాను" అని WFI చీఫ్ అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్..తనని తాను నిర్దోషినని, న్యాయ వ్యవస్థపైనా, దర్యాప్తు సంస్థలపైనా తనకు నమ్మకం ఉన్నందున ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని పునరుద్ఘాటించారు. ఈ నిరసన తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమని పేర్కొన్నారు.
బ్రిజ్ భూషణ్ సింగ్పై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదికను ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు . డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ని పోర్ట్ఫోలియో నుంచి తొలగించాలని నిరసన తెలిపిన రెజ్లర్లు కూడా కోరుతున్నారు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఏడుగురు మహిళా రెజ్లర్ల (మైనర్తో సహా) ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏప్రిల్ 28న ఢిల్లీ పోలీసులు అంగీకరించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మొదటి ఎఫ్ఐఆర్ మైనర్ బాధితురాలు చేసిన ఆరోపణలకు సంబంధించినది. పోక్సో చట్టం కింద, నమ్రతను అతిక్రమించడం మొదలైన వాటికి సంబంధించిన సంబంధిత IPC సెక్షన్లతో పాటు నమోదు చేయబడింది.
