రాత్రి బయటకు వెళ్లే మహిళలంతా వేశ్యలే.. వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.
రాత్రిపూట 9 దాటిన తర్వాత బయటకు వెళ్లే మహిళలంతా వేశ్యలేనని... వారిని అత్యాచారం, హత్య చేసినా తప్పు కాదంటూ కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2011లో జరిగిన ఓ అత్యాచారాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా గాయపరిచాడు. ఐదు రోజుల తర్వాత ఆమె మరణించింది. స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.
ఈ ఘటన గురించి స్వాలి బత్రే తాజాగా మాట్లాడుతూ.. `రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది. అందులో అతని తప్పేం ఉంది. రాత్రిపూట బయట కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం, చంపడం తప్పు కాద`ని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. కేరళలో ముస్లిం మతాధికారులలో 27 ఏళ్ల స్వాలి బత్రే ఒకరు. ఆయన హెచ్డీపీ సిండ్రోమ్తో బాధపడుతుండడంతో 27 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలానే ఉంటారు. కాగా, ఈయన ఇప్పటికే ఇలాంటి ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేశారు.