Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో దారుణం.. మ‌హిళ మృత‌దేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. రైల్వే ట్రాక్ వ‌ద్ద ప‌డేసి..

ముంబైలో ఓ మహిళ మృత‌దేహాం రైల్వే ట్రాక్ వద్ద గోనె సంచిలో లభించింది. మృతురాలి వయస్సు 28 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Womans body found in gonad bag at Mumbai railway track
Author
Mumbai, First Published May 25, 2022, 9:48 AM IST

ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ మృత‌దేహాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు బ్యాగ్ లో కుక్కి అనంత‌రం ఆ బ్యాగ్ ను రైల్వే ప‌ట్టాల స‌మీపంలో ప‌డేశారు. ఈ ఘట‌న మ‌హిమ్ ప్రాంతంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలను పోలీసులు వెల్ల‌డించారు. 

మంగళవారం ఉదయం ముంబైలోని మహీమ్‌లోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో బ్యాగ్‌లో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు. త‌రువాత ఈ హత్యపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. మృతి చెందిన మ‌హిళ‌ను సారిక దామోదర్ చల్కే (28)గా గుర్తించామని అన్నారు. 

ఒడిశాలో టూరిస్ట్ బస్సు బోల్తా... ఆరుగురు దుర్మరణం, 30మందికి తీవ్ర గాయాలు

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత అనుమానితుడిని గుర్తించామని పోలీసు బృందాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ముంబై రైల్వే పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఇలాంటి ఘ‌ట‌నే ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన ఢిల్లీలో వెలుగులోకి వ‌చ్చింది. త‌ప్పిపోయిన 14 ఏళ్ల బాలిక గోనె సంచిలో కుళ్లిన మృత‌దేహంగా క‌నిపించింది. ఈ ఘ‌ట‌న ఔట‌ర్ ఢిల్లీలోని న‌రేలా ప్రాంతంలో జ‌రిగింది. ఆ బాలిక ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ నుంచి క‌నిపించ‌కుండా పోయింది. ఆ బాలిక కోసం త‌ల్లిదండ్రులు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో వెతికారు. కానీ ఆమె జాడ క‌నిపించ‌లేదు. దీంతో మూడు రోజుల తరువాత అంటే ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే అప్ప‌టి నుంచి ఆ బాలిక కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

శ్రీనగర్ లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. పోలీసును కాల్చి చంపి.. కుమార్తె పై కూడా కాల్పులు..

అయితే అదే నెల 21వ తేదీన అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో గోనె సంచిలో కుళ్లిన స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. ఆ మృత‌దేహం త‌ప్పిపోయిన ఈ బాలిక‌దే అని నిర్ధార‌ణకు వ‌చ్చారు. ఆ దుకాణంలో ప‌ని చేసే ఓ వ్య‌క్తి, త‌న స్నేహితుడు అందులో క‌లిసి మ‌ద్యం తాగార‌ని, త‌రువాత మైన‌ర్ పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. అనంత‌రం ఆమెను హ‌త్య చేసి అదే దుకాణంలో ఓ గోనె సంచిలో మూల‌కు ఉంచార‌ని చెప్పారు. కుల్లిన వాస‌న రావ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింద‌ని, నిందితుల‌పై హత్య, గ్యాంగ్ రేప్, కిడ్నాప్, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు చేశామ‌ని డీసీపీ బ్రిజేంద్ర యాదవ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios